రవితేజ హీరోగా విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో నల్లమలుపు బుజ్జి – వల్లభనేని వంశీ నిర్మాణంలో ‘టచ్ చేసి చూడు’

‘మాస్ మహారాజా’ రవితేజ హీరోగా ‘టచ్ చేసి చూడు’ పేరుతో ఓ భారీ చిత్రం రూపొందనుంది.బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. విక్రమ్ సిరికొండ దర్శకునిగా పరిచయవుతున్నారు .జనవరి 26 (గురువారం) రవితేజ బర్త్ డే సందర్భంగా  ఈ సినిమా వివరాలను దర్శక నిర్మాతలు అధికారికంగా వెల్లడించారు. నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ మాట్లాడుతూ – “మాకు చిరకాల మిత్రుడైన రవితేజ తో ఈ సినిమా నిర్మిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మాస్ మహారాజా ఇమేజ్ కి తగ్గట్టుగా ప్రముఖ రచయిత వక్కంతం వంశీ అద్భుతమైన కథను తయారు చేసారు. ఫిబ్రవరి మొదటి వారంలో చిత్రీకరణ మొదలు పెడుతున్నాం.” అని తెలిపారు. దర్శకుడు విక్రమ్ సిరికొండ మాట్లాడుతూ – “ఇదొక డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్.ఇందులో ఇద్దరు కథానాయకులుంటారు. ఇప్పటికే రాశి ఖన్నాను ఎంపిక చేసాం. మరొక నాయికను త్వరలోనే ప్రకటిస్తాం.హేమాహేమీలైన సాంకేతిక బృందం ఈ చిత్రానికి పనిచేస్తున్నారు” అని చెప్పారు.
ఈ చిత్రానికి
సంగీతం : ప్రీతమ్స్ ఎ అండ్ ఆర్ వెంచర్ జామ్ 8
కథ :  వక్కంతం వంశీ.
స్క్రీన్ ప్లే : దీపక్ రాజ్.
మాటలు : శ్రీనివాస్ రెడ్డి.
అడిషనల్ డైలాగ్స్: రవిరెడ్డి, మల్లు
ఎడిటింగ్ : గౌతం రాజు.
ఆర్ట్: రమణ.
కో డైరెక్టర్ : రాంబాబు.
ఛాయాగ్రహణం : ఎం. సుకుమార్.
యాక్షన్ : పీటర్ హేన్స్.
నిర్మాతలు : నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ.
దర్శకత్వం : విక్రమ్ సిరికొండ.

About CineChitram

Check Also

Tamil Director A.R. Murugadoss to Make Comeback After 6 Years

⭐︎ After a six-year hiatus, popular Tamil director A.R. Murugadoss is finally making his comeback …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading