ఆయుష్మాన్ భ‌వ ` లోగో లాంచ్!!

ద‌ర్శ‌కుడు మారుతి స‌మ‌ర్ప‌ణ‌లో  యువ క‌థానాయ‌కుడు చ‌ర‌ణ్ తేజ్ హీరోగా , ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ  మారుతి టాకీస్- సి.టి.ఎఫ్ సంస్థ‌లు సంయుక్త నిర్మాణంలో శ్రీనివాస రావు , ర‌జ‌నీ కుమారి నిర్మిస్తున్న చిత్రం` ఆయుష్మాన్ భ‌వ `.  త్రినాథ్ రావు  న‌క్కిన  క‌థ అందించ‌గా , ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ చిత్రం క‌ర్ట‌న్ రైజ‌ర్ కార్య‌క్రమం ( మార్చి 15) న హైద‌రాబాద్ ఎన్ – క‌న్వెన్ష‌న్ హాల్ లో సిని ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో  ఘ‌నంగా  జ‌రిగింది. మారుతి , ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు , నిర్మాతలు శ్రీనివాస‌రావు , ర‌జ‌నీ కుమారి, డూడ్లీ  సినిమా టైటిల్ లోగోను ఆవిష్క‌రించారు. అనంత‌రం…
ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ  `చ‌ర‌ణ్ తేజ్ రెండేళ్లుగా ప‌రిచ‌యం. మంచి క‌మిట్ మెంట్ తో ఈ సినిమా తెర‌కెక్కించ‌నున్నాడు.     క‌థ కోసం రెండేళ్లు స‌మ‌యం  ప‌ట్టింది. ప‌క‌డ్బందీ స్క్రిఫ్ట్ తో ఈ చిత్రం తెర‌క్కెకుతుంది. మారుతి అంటే గ్యారంటీగా స‌క్సెస్ ఉంటుంది . వెంక‌టేష్ , మ‌హేష్ బాబు, రాంచ‌ర‌ణ్ సినిమాల‌కు ప‌నిచేశాం. వాళ్లంతా ఇప్పుడు పెద్ద హీరోలు అయ్యారు.  చ‌ర‌ణ్ తేజ్ కూడా భ‌విష్య‌త్తులో  పెద్ద‌స్టార్ అవుతాడు. ప్ర‌పంచంలో జ‌రుగుతున్న‌ సామాజిక అంశాల‌కు ద‌ర్ప‌ణం  ప‌ట్టేలా సినిమా  ఉంటుంది` అన్నారు. 
డైరెక్ట‌ర్ మారుతి మాట్లాడుతూ ` చ‌ర‌ణ్ తేజ్ ఎంతో ప‌ట్టుద‌ల , సినిమా మీద ఫ్యాష‌న్ ఉన్న‌వ్య‌క్తి .  డాక్ట‌ర్ అయిన‌ప్ప‌టికి సినిమా మీదున్న ఇష్టంతో హీరో గా , డైరెక్ట‌ర్ గా ఇంట్ర‌డ్యూస్ అవుతున్నాడు. ఒక సంవ‌త్స‌రం పాటు త్రినాథ్ , ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ ఎంతో ఎఫర్ట్ పెట్టి  ఈ క‌థ  సిద్దం చేశారు.  త‌ప్ప‌కుండా ఈ సినిమా చ‌ర‌ణ్ తేజ్ కి పెద్ద సక్సెస్ ని ఇస్తుంది ` అని  అన్నారు.
నిర్మాత‌ల్లో ఒక‌రైన ర‌జ‌నీ కుమారి మాట్లాడుతూ – “ చ‌ర‌ణ్ ప‌ట్టుద‌ల ఉన్న వ్య‌క్తి . చిన్ప‌ప్ప‌టి నుండి సినిమాలంటే  అంటే ఫ్యాష‌న్.  క‌ష్ట‌ప‌డి ఈ స్థాయికి వ‌చ్చాడు . ఇంక ముందు కూడా అదే క‌ష్టంతో మంచి స‌క్సెస్ లు  అందుకుంటాడ‌న్న న‌మ్మ‌కం ఉంది“ అన్నారు.
ద‌ర్శ‌క‌, హీరో చ‌ర‌ణ్ తేజ్ మాట్లాడుతూ ` ప‌క్కా ఎంట‌ర్ టైన‌ర్ మూవీ ఇది . త‌ప్ప‌కుండా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని అల‌రించేలా ఉంటుంది. ఏప్రిల్ లో షూటింగ్ ప్రారంభించి సినిమాని ఆగ‌ష్టు 11 న విడుద‌ల చేస్తాం“ అన్నారు.
డూడ్లీ మాట్లాడుతూ “ ద‌క్షినాదిన  నా తొలి సినిమా ఇదే . హిందీలో చాలా చిత్రాలు చేశాను . తెలుగులో ఇంత‌మంచి క‌థ తో రూపొందుతున్న చిత్రంతో లాంచ్ అవ‌డం ఆనందంగా ఉంది. వైవిధ్య‌మైన క‌థ ఈ సినిమాకి కుదిరింది` అని అన్నారు.
గీతాంజ‌లి మాట్లాడుతూ  “ ఈ చిత్రంలో చాలా మంచి పాత్ర పోషిస్తున్నాను . మంచి టీంతో రూపొందుతున్న ఈ సినిమా పెద్ద విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాను“ అని  అన్నారు.
సంగ‌త ద‌ర్శ‌కులు మీట్ బ్ర‌ద‌ర్స్ మాట్లాడుతూ  “ తెలుగులో సినిమా చేయ‌డం ఆనందంగా ఉంది. సినిమా కు మంచి బాణీలు అందిస్తాం.  త‌ప్ప‌కుండా సినిమా పెద్ద హిట్ అవుతుంది` అని అన్నారు.

About CineChitram

Check Also

“ఆచారి అమెరికా యాత్ర” మొదలైంది!

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading