“అప్పట్లో ఓక‌డుండేవాడు” లాంటి చిత్రం త‌రువాత మ‌రో స‌రికొత్త క‌థ‌తో శ్రీవిష్ణు చిత్రం

2016 చివ‌రిలో మంచి క‌మ‌ర్షియ‌ల్ చిత్రంగా కొత్త కాన్సెప్ట్ తో విమ‌ర్శ‌కుల ప్ర‌శంశ‌లు ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ అందుకున్న “అప్ప‌ట్లో ఓక‌డుండేవాడు” లాంటి న్యూవేవ్ మూవీతో గ‌త సంవ‌త్స‌రానికి ఘ‌నంగా వీడ్కోలు ప‌లికిన యంగ్ హీరో శ్రీవిష్ణు మ‌రియు ఓ స్టార్ హీరో, ఇంకో ఇద్ద‌రు పాపుల‌ర్ హీరో, హీరోయిన్స్  కాంబినేష‌న్ లో కాన్సెప్టెడ్ మ‌ల్టిస్టార‌ర్ చిత్రం తీస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ఇంద్ర‌సేన ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కానున్నారు. బాబా క్రియోష‌న్స్‌ బ్యాన‌ర్ పై డా. ఎం.వి.కె రెడ్డిగారు స‌మ‌ర్ప‌ణ‌లో అప్పారావు బెల్లాన‌ నిర్మాత‌గా తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి లో సెట్స్ మీద‌కి వెల్ల‌నుంది. 
 
ద‌ర్శ‌కుడు ఇంద్ర‌సేన మాట్లాడుతూ..” ఈ చిత్రం రెగ్యుల‌ర్ క‌మ‌ర్ష‌య‌ల్ చిత్రాల కంటే భిన్నంగా  వుంటుంది. కొత్త క‌థ‌, క‌థ‌నాల‌తో కంప్లీట్ వెస్ట్ర‌న్ మూవీస్ బాట‌లో సాగుతుంది. ఈ చిత్రం లో స‌మాంత‌రంగా సాగే మూడు క‌థ‌లుంటాయి. అందులో వుండే మూడు మిస్ట‌రీస్ ని చేధించ‌డం మీద ఈ క‌థ ఆధార‌ప‌డి వుంటుంది. ఇది రొల‌ర్ కాస్ట‌ర్ థ్రిల్ల‌ర్ గా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది. మిగతా వివ‌రాలు అతి త్వ‌ర‌లో మీకు తెలియ‌జేస్తాం..” అని అన్నారు
 
డాక్ట‌ర్‌. ఎం.వి.కె రెడ్డి స‌మ‌ర్ఫ‌ణ‌.. 
ప్రోడ‌క్ష‌న్ డిజైన‌ర్- రాజీవ్ నాయిర్‌, 
సంగీతం- స‌తీష్ ర‌ఘునాధ‌న్‌,
 నిర్మాత‌- అప్పారావు బెల్లాన‌ 
క‌థ‌,క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వం- ఇంద్ర‌సేన ఆర్

About CineChitram

Check Also

గంటా రవి, జయంత్‌ సి. పరాన్జీల ‘జయదేవ్’ 3వ సాంగ్ ప్రోమో విడుదల

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి హీరోగా శ్రీ లక్ష్మీవెంకటేశ్వర ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై డీసెంట్‌ …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading