ఒడిశాలో జక్కన్న టీమ్‌! | CineChitram

టాలీవుడ్‌లో ప్రస్తుతం తెరకెక్కుతున్న ది మోస్ట్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ SSMB29 కోసం యావత్ సినీ లోకం ఎంత గా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తుండగా మహేష్ బాబు ఈ సినిమాతో పాన్ వరల్డ్ హీరోగా మారుతున్నాడు. ఇక ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టిన ఈ చిత్రం, ప్రస్తుతం రెండో షెడ్యూల్ కోసం సిద్ధమైంది.

ఈ చిత్రాన్ని అడవి నేపథ్యంలో తెరకెక్కించనున్నాడు జక్కన్న. ఇందుకోసం ఆయన లొకేషన్ల వేట కూడా చేశాడు. ఇప్పుడు ఈ సినిమా రెండో షెడ్యూల్‌ను తూర్పు కనుమలలో చిత్రీకరించేందుకు టీమ్ అక్కడికి వెళ్లింది. తాజాగా ఒడిశాలో ఈ చిత్ర యూనిట్ ల్యాండ్ అయ్యింది. ఇక ఎయిర్‌పోర్ట్‌లో మహేష్ బాబుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ సినిమాలో మరో వెర్సటైల్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నాడు. ఆయన కూడా ఈ టీమ్ వెంట ఒడిశాకు చేరుకున్నట్లు ఈ ఫోటోల్లో కనిపిస్తుంది.

దీంతో ఈ సినిమాను రాజమౌళి నెక్స్ట్ లెవెల్ కథతో తెరకెక్కించనున్నాడని.. ఈ సినిమాతో బాబు బాక్సాఫీస్ భరతం పట్టడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది.

The post ఒడిశాలో జక్కన్న టీమ్‌! first appeared on Andhrawatch.com.

About

Check Also

Jaipur Court Issues Notices To Shah Rukh Khan, Ajay Devgn, And Tiger Shroff Over Pan Masala Ad   | CineChitram

In a significant legal turn of events, the Jaipur Consumer Disputes Redressal Commission has issued …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading