ఓటీటీ డేట్ లాక్ అయ్యిందా! బాలీవుడ్ టాలెంటెడ్ హీరో విక్కీ కౌశల్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన హిస్టారికల్ హిట్ సినిమా “ఛావా” కోసంఅందరికీ తెలిసిందే. అయితే ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యి అదరగొట్టింది.
ఒక్క హిందీ లోనే కాకుండా తెలుగులో కూడా రిలీజ్ కి వచ్చి మంచి వసూళ్లు సాధించిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై ఇపుడు లేటెస్ట్ బజ్ తెలుస్తోంది. దీని ప్రకారం ఛావా రానున్న ఏప్రిల్ 11 నుంచి స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉండనున్నట్టు టాక్. మరి ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
మరి దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రానున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు అలాగే మాడాక్ ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.
The post ఓటీటీ డేట్ లాక్ అయ్యిందా! first appeared on Andhrawatch.com.