అలా…. ఎస్కెప్‌ అయ్యారంట..! | CineChitram

దక్షిణాదిన మంచి సినిమాలు నిర్మించిన నిర్మాతల్లో ఏఎం రత్నం పేరు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేయడంలో ఈయనకు మంచి అనుభవమే ఉంది. ఆయన నిర్మించిన భారతీయుడు చిత్రం అప్పట్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గరే కాదు, ప్రేక్షకుల హృదయాల్లో కూడా సూపర్ హిట్ అయింది.

అయితే ఇప్పుడు భారతీయుడు 2 అనే సీక్వెల్ రూపొందింది కానీ అది  ఏఎం రత్నం నిర్మాణంలో కాదు. ఇదే విషయంలో ఆయన ఇటీవల ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. సీక్వెల్ తన దగ్గర ఎందుకు రాలేదన్నదానికి రెండు కారణాలు ఉన్నాయని చెప్పారు. ఒకవైపు తాజా కాలానికి తగ్గట్టు టెక్నికల్ గా, ఆర్టిస్టుల ఎంపికలో మార్పులు రావడం ఒక కారణం అయితే.. మరోవైపు శంకర్ అప్పటికే లైకా ప్రొడక్షన్స్ సంస్థతో ఓ సినిమా చేసేందుకు ఒప్పందం చేసుకున్నారట. ఆ ప్రాజెక్టు ఏమయినా కావొచ్చు కానీ చివరికి అదే భారతీయుడు 2గా మారిందని అన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో తాను ఈ సినిమాను చేయకపోవడం కొంతవరకు మంచి నిర్ణయమే అయ్యిందనిపించిందని సూచనగా చెప్పారు.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …