టాలీవుడ్లో తెరకెక్కిన ‘కార్తికేయ-2’ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిన విషయమే.డైరెక్టర్ చందూ మొండేటి తీర్చిదిద్దన ఈ సినిమాలో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.
ఇక ఈ సినిమాలో కథకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. శ్రీకృష్ణునికి సంబంధించి ఇందులో చూపెట్టిన కథ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.అయితే, ఈ సినిమాకు మరో సీక్వెల్ ‘కార్తికేయ-3’ని తెరకెక్కించబోతున్న ట్లు చందూ మొండేటి గతంలో వెల్లడించాడు. అయితే, ఇప్పుడు తండేల్ మూవీ విడుదల తర్వాత తాను కార్తికేయ-3 మూవీపై ఫోకస్ పెడతానని చెప్పారు.
ఇక ఈ మూవీ కోసం తన దగ్గర అద్భుతమైన కథ రెడీగా ఉందని.. ఈ కథ శ్రీ కృష్ణుడి చుట్టూ తిరుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు.దీంతో ఈ సినిమాలో ఎలాంటి కథ ఉండబోతుందా.. ఇందులో శ్రీకృష్ణుని గురించి ఎలాంటి విషయాలు చూపెడతారా అనేది ఆసక్తికరంగా మారింది. మరి చందూ మొండేటి కార్తికేయ-3 చిత్రం ఎప్పుడు మొదలు కాబోతుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
The post కార్తీకేయ 3 పై చందూ మొండేటి ఏమన్నారంటే! first appeared on Andhrawatch.com.