తారక్‌, రజినీ సినిమాలను భయపెడుతున్న ఆ సినిమా! | CineChitram

ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రెండు భారీ సినిమాలు ఒకే సమయంలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘వార్ 2’ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తుందో అని సినీ ప్రపంచం అంతా వెయిట్‌ చేస్తోంది.

ఇదే సమయంలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘కూలీ’ కూడా ఆగస్టు 14న భారీ స్థాయిలో థియేటర్లలోకి రానుంది. అయితే ఈ రెండు పాన్ ఇండియా సినిమాల మధ్య అనుకోని పరిస్థితి నెలకొంది. బెంగాల్ మార్కెట్‌లో వీటికి పెద్దగా క్రేజ్ లేకుండా, అక్కడ విడుదలవుతున్న ఓ చిన్న సినిమా టికెట్ బుకింగ్స్‌లో ముందంజలో ఉంది. ‘ధూమ్ కేతు’ అనే ఆ సినిమా అక్కడి ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంటూ, బుకింగ్స్‌లో పెద్ద సినిమాలను వెనక్కి నెట్టేస్తోంది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమా దాదాపు పది సంవత్సరాల క్రితం షూటింగ్ ప్రారంభమై, 2017లో పూర్తి అయింది. కానీ వేరే వివిధ కారణాల వల్ల ఇంతకాలం విడుదల కాలేదు. ఇప్పుడు మేకర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. మరి ఈ ధూమ్ కేతు, ‘వార్ 2’ మరియు ‘కూలీ’ సినిమాలకు ఎంతమేర పోటీ ఇస్తుందో వేచి చూడాల్సిందే.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …