మెగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సాయి దుర్గ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రాలు “బ్రో” అలాగే “విరూపాక్ష” వరుస హిట్స్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాలు తర్వాత తాను ఓ భారీ చిత్రాన్ని తన కెరీర్ 18వ ప్రాజెక్ట్ గా యువ దర్శకుడు రోహిత్ నుంచి అనౌన్స్ చేసాడు. హను మాన్ మేకర్స్ తో ప్రకటన వచ్చినప్పటి నుంచే మంచి బజ్ నెలకొనగా ఇపుడు ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ చిత్రం నుంచి తాజా గానే సాలిడ్ ట్రీట్ గా గ్లింప్స్ ని ఈ డిసెంబర్ 12న ఇస్తున్నట్టుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి ఈ గ్యాప్ లో ఓ మెగా మాస్ అనౌన్సమెంట్ అంటూ ఇపుడు మేకర్స్ మరో తాజా అప్డేట్ అందించారు. అయితే ఈ సినిమా టీజర్ గ్లింప్స్ లాంఛ్ కి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రాబోతున్నట్టుగా బజ్ వినపడుతుంది. మరి ఇది అందుకోసమేనా అనేది చూడాలి.
The post మరో మెగా అనౌన్స్మెంట్ కి ముహుర్తం ఖరారు! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
