ప్రస్తుతం దేశం అంతా ఘనంగా వినిపిస్తున్న అంశాల్లో ప్రయగరాజ్ మహా కుంభమేళా మాత్రమే అని చెప్పవచ్చు. కోట్లాది మంది హిందువులు ఈ కుంభమేళాలో పాల్గొని పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. అయితే ఈ కుంభమేళాలో అనేకమంది సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఇక ఈ కుంభమేళాలో మొదటిసారి ఒక టీజర్ రిలీజ్ కాబోతోంది.
మిల్కీ బ్యూటీ తమన్నా మెయిన్ లీడ్ లో దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న సినిమా “ఓదెల 2”. గతంలో ఓటీటీ హిట్ సినిమా ఓదెల కి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాలో తమన్నా అఘోరీగా కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో మేకర్స్ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వస్తున్నారు.
ఇక్కడ సినిమా టీజర్ ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఫిబ్రవరి 22న టీజర్ ని విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. మరి అక్కడ రిలీజ్ చేసే టీజర్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తుండగా మేకర్స్ రిలీజ్ డేట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
The post కుంభమేళాలో ఓదెల 2 ! first appeared on Andhrawatch.com.