తన కింగ్డమ్ లో ఎమోషనల్ ఫ్రేమ్ …రవితేజ పిక్‌ మూమెంట్‌! | CineChitram

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నా.. తమ కష్టం, పట్టుదలతో ఎదిగిన వారంటే అందరికీ ప్రత్యేక గౌరవం ఉంటుంది. అలాంటి వారిలో మాస్ మహారాజా రవితేజ పేరు ముందు వరుసలో ఉంటుంది. ఇండస్ట్రీకి వచ్చాక ఎన్నో కష్టాలు ఎదుర్కొని, చిన్నచిన్న పాత్రలతో ప్రారంభించిన రవితేజ.. తన టాలెంట్‌తో ఒక్కో అడుగు వేసుకుంటూ స్టార్ స్థాయికి చేరుకున్నారు.

ఇటీవల రవితేజ ఓ థియేటర్ ప్రారంభించిన సందర్భంలో తీసిన ఓ ఫొటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆ చిత్రంలో, రవితేజ తనే నిర్మించిన థియేటర్‌లో సగటు ప్రేక్షకుడిలా కూర్చుని తన సినిమా చూశారు. ఈ సీన్ చూసిన అభిమానుల హృదయాలను తాకింది. ఎందుకంటే.. వందల మంది హీరోల్ని చూసిన ఈ ఇండస్ట్రీలో, ఓ వ్యక్తి తన జీవితం మొత్తాన్ని వెచ్చించి, ప్రేక్షకుడిగా తిరిగి తననే చూసుకుంటే.. అది ఎమోషనల్ క్షణం కాదా?

కష్టకాలంలో ఉన్నప్పుడు చిన్న పాత్రలు ఆశించిన రవితేజ.. ఇప్పుడు తన సినీ ప్రయాణాన్ని, తనే నిర్మించిన థియేటర్‌లో చూసే స్థాయికి చేరుకున్నారు. ఇది చూసినవాళ్లంతా.. ఎంతైనా ఇది సాధారణమైన విషయం కాదంటూ భావోద్వేగంతో స్పందిస్తున్నారు.

ఇక ప్రస్తుతం రవితేజ నటిస్తున్న కొత్త చిత్రం మాస్ జాతరపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. టైటిల్ దగ్గర నుంచి ఇప్పటివరకు బయటకు వచ్చిన అప్‌డేట్స్‌ చూసినా.. ఇది పక్కా మాస్ ఎంటర్టైనర్ అనే అర్థమవుతుంది.

తన ప్రయాణం మొత్తం చూసినవాళ్లకు.. రవితేజ ఇప్పుడు మాస్ జాతరతో మరోసారి తన ఎనర్జీని ప్రూవ్ చేసే ఛాన్స్ దక్కిందని భావిస్తున్నారు.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …