బుల్లితెర మీద ఎప్పుడంటే! | CineChitram

బుల్లితెర మీద ఎప్పుడంటే! ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వండర్స్ సెట్ చేసిన రీజనల్ ఇండస్ట్రీ హిట్ చిత్రం “సంక్రాంతికి వస్తున్నాం” కోసం తెలిసిందే. విక్టరీ వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన ఈ భారీ హిట్ చిత్రం థియేటర్స్ లో దుళ్లకొట్టేసింది.

అయితే అంతా ఇక ఓటిటి డేట్ కోసం ఎదురు చూస్తుంటే జీ సంస్థ వారు ఈ సినిమా తాలూకా బుల్లితెర టెలికాస్ట్ ను ముందుగా అనౌన్స్ చేసి ట్విస్ట్ ఇచ్చారు. అయితే జీ తెలుగులో అతి త్వరలోనే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా రానుంది అని అనౌన్స్ చేసిన ఈ సినిమా ఇపుడు ఫైనల్ గా టెలికాస్ట్ డేట్ ని సెట్ చేసుకుంది. అయితే జీ తెలుగు వారు ఈ చిత్రాన్ని ఈ మార్చ్ 1 సాయంత్రం 6 గంటలకి ప్రసారం చేస్తున్నట్టుగా రివీల్ చేశారు.

మరి బిగ్ స్క్రీన్ పై వండర్స్ సెట్ చేసిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్మాల్ స్క్రీన్ పై కూడా టీఆర్పీ రేటింగ్స్ లో రికార్డు సెట్ చేస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.

The post బుల్లితెర మీద ఎప్పుడంటే! first appeared on Andhrawatch.com.

About

Check Also

అందుకే లాభాలు! | CineChitram

ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న కోర్ట్ డ్రామా మూవీ ‘కోర్ట్ – స్టేట్ వర్సెస్ నోబడి’ ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading