యానిమల్‌ మూడు పార్ట్‌ లు! | CineChitram

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన ‘యానిమల్’ సినిమా భారీ కలెక్షన్స్ ను సాధించి.. అద్భుత విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సీక్వెల్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ‘యానిమల్’ మూవీ రెండో పార్ట్ షూటింగ్ 2027లో ప్రారంభం అవుతుందని హీరో రణ్‌బీర్ కపూర్ చెప్పారు. ప్రస్తుతం డైరెక్టర్‌ సందీప్ రెడ్డి వంగా వేరే ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నారని.. అందుకే 2027లో మొదలు పెడతాం అని రణ్‌బీర్ ఓ క్లారిటీ ఇచ్చారు.

అలాగే, యానిమల్‌కు పార్ట్-3 కూడా ఉంటుందని రణ్‌బీర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.రెండో పార్ట్‌లో హీరో-విలన్ మధ్య ఆసక్తికర పోరు ఉంటుందని.. ముఖ్యంగా పార్ట్-2 యానిమల్ పార్క్‌గా రాబోతుందని రణ్‌బీర్ తెలిపారు. అయితే, ఈ సినిమా పై ఎన్నో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ విమర్శలపై హీరో రణ్‌బీర్‌ ఓ క్లారిటీ ఇచ్చాడు.

 ‘యానిమల్‌ విషయంలో అందరి అభిప్రాయలను నేను కూడా అంగీకరిస్తున్నాను.. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే, ప్రేక్షకులకు నచ్చే సినిమాలు తీసుకురావాల్సిన బాధ్యత మా పై ఉంది. కొత్తదనాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఒక నటుడిగా ఇది చాలా ముఖ్యం. ఎప్పుడైతే నటులందరూ విభిన్నమైన పాత్రలు పోషిస్తారో.. అప్పుడే వారి కెరీర్‌ బాగుంటుంది’ అంటూ రణబీర్ చెప్పుకొచ్చాడు.

The post యానిమల్‌ మూడు పార్ట్‌ లు! first appeared on Andhrawatch.com.

About

Check Also

Aamir Khan Confirms Dating Gauri Spratt, Opens Up on Mahabharat Dream Project | CineChitram

On the occasion of his birthday on March 14, Bollywood superstar Aamir Khan celebrated with …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading