చిరంజీవి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో వాల్తేరు వీరయ్య కూడా ఒకటి’. గతేడాది సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం మెగా అభిమానుల్ని ఆకట్టుకుంది. మరోసారి వీరిద్దరి కాంబోలో ఓ సినిమా రాబోతోందని టాక్ వినపడుతుంది. చిరంజీవి కోసం బాబీ ఓ కథ రెడీ చేశారని, అది చిరుకి బాగా నచ్చిందని, ఈ సినిమాని త్వరలో పట్టాలెక్కించడానికి రెడీగా ఉన్నారని తెలుస్తుంది.
‘విశ్వంభర’ తరవాత కొంతమంది దర్శకుల్ని లైన్లో పెట్టారు చిరు. అందులో అనిల్ రావిపూడి కూడా ఉన్నారు. వీలైతే బాబీ, అనిల్ రావిపూడి ఈ రెండు సినిమాల్నీ ఒకేసారి మొదలెట్టే ఆలోచనలో చిరు ఉన్నారు. మరోవైపు ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కూడా చిరుకి ఓ కథ చెప్పారు. అయితే అది ఇప్పట్లో సెట్ పైకి వెళ్లే అవకాశాలు కనపడడం లేదు.
నానితో `పారడైజ్` సినిమా చేస్తున్నాడు శ్రీకాంత్. ఆ తరవాతే చిరు సినిమా ఉంటుంది. ఈలోగా బాబీ, అనిల్ రావిపూడి సినిమాల్ని పూర్తి చేయాలన్నది చిరు లక్ష్యంగా పెట్టుకున్నారు. బాబీ ప్రస్తుతం బాలకృష్ణతో ‘డాకూ మహారాజ్’ సినిమా చేస్తున్నారు. ఈ సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. అనిల్ రావిపూడి సైతం తన సినిమాని సంక్రాంతి బరిలో నిలిపిన సంగతి తెలిసిందే. ఆయన దర్శకత్వం వహించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ పండక్కే విడుదల కానుంది.
The post మరోసారి జత కడుతున్నారు! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
