స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకుందో మనం చూశాం. ఈ సినిమాను పూర్తి కామెడీ ఎంటర్టైనర్గా చిత్ర యూనిట్ రూపొందించింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.300 కోట్లకు పైగా వసూళ్లతో దుమ్ములేపింది. ఈ సినిమాతో దిల్ రాజు, శిరీష్ మంచి లాభాలను అందుకున్నారు.
ఇక ఇప్పుడు ఈ సినిమాను రీమేక్ చేసే పనిలో ఉన్నారు నిర్మాత దిల్ రాజు. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసేందుకు దిల్ రాజు ప్రయత్నిస్తున్నారట. అయితే, దర్శకుడు అనిల్ రావిపూడి మాత్రం మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయనున్నారు. దీంతో ఈ చిత్ర రీమేక్ను ఆయన డైరెక్ట్ చేయరని తెలుస్తోంది. ఇక ఇప్పుడు మరో డైరెక్టర్తో ఈ మూవీని రీమేక్ చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారట.
ఈ రీమేక్ మూవీలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించబోతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన ఈ సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఒక్కసారి డైరెక్టర్ కన్ఫర్మ్ అవగానే, ఈ సినిమాను దిల్ రాజు అఫీషియల్గా అనౌన్స్ చేస్తారని సినీ సర్కిల్స్లో వార్తలు వినిపిస్తున్నాయి.
The post రీమేక్ పనిలో దిల్ రాజు బిజీ! first appeared on Andhrawatch.com.