`మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు` చిత్రంలోనా పాత్ర కొత్త త‌ర‌హా వినోదాన్ని అందిస్తుంది – పృథ్వీ

పృథ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా, సలోని, శృతి సోధి హీరోయిన్లుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మించిన ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబర్‌ 16న విడుదల చేసేందుకు నిర్మాత కె.కె.రాధామోహన్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా పృథ్వీ పాత్రికేయుల స‌మావేశంలో సినిమా గురించిన సంగ‌తుల‌ను తెలియ‌జేశారు.
పృథ్వీ మాట్లాడుతూ – “సినిమా వాల్ పోస్ట‌ర్‌లో నా ఫోటో ప‌డితే చాలని అనుకున్నాను. కానీ హాస్య‌న‌టుడిగా ఓ మంచి స్థాయికి చేరుకోవ‌డం ఎంతో ఆనందంగా ఉంది. అయితే స్థాయి గురించి నేను పెద్ద‌గా ప‌ట్టించుకోను. ఎందుకంటే ఇండ‌స్ట్రీలో ఎవ‌రి శాశ్వ‌తం కాదు. క‌థ చెప్పినప్పుడు ఉన్న క్యారెక్ట‌ర్ క‌న్నా నా పాత్ర‌ను ద‌ర్శ‌కుడు స‌త్తిబాబుగారు వెయ్యి రెట్లు బాగా చిత్రీక‌రించారు. సాధార‌ణంగా ఈ సినిమాలో న‌న్ను అంద‌రూ హీరో అంటున్నారు కానీ నేను హీరోను కాను. ఈ సినిమాలో చాలా ముఖ్య‌మైన పాత్ర‌లో క‌నిపిస్తాను. నా పాత్ర క్రియేట్ చేసే కామెడి కొత్త త‌ర‌హాలో ఉంటుంది. స‌లోని నాకు జ‌త‌గా న‌టించింది. మా మ‌ధ్య ఓ పాట త‌ప్ప కెమిస్ట్రీ అంటూ ఏం ఉండ‌దు. పాట విష‌యానికి వ‌స్తే నాతో గ‌ణేష్ మాస్ట‌ర్‌గారు చ‌క్క‌టి స్టెప్పులు వేయించారు. ప్ర‌స్తుతం కాట‌మ‌రాయుడు సినిమాలో హీరోయిన్ బాబాయ్‌గా న‌టిస్తున్నాను. అలాగే తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో మ‌ల్ల‌ప్ప అనే పేరుతో ఓ సినిమా చేస్తున్నాను. కర్ర‌సాములో ఆరితేరిన ఓ యోధుడిగా క‌నిపిస్తాను. సీరియ‌స్‌గానే ఉంటూనే మంచి వినోదాత్మ‌క చిత్రం. అలాగే మిస్ట‌ర్‌, వైశాఖం, విన్న‌ర్‌, ద్వార‌న‌, నాని కొత్త చిత్రంలో న‌టిస్తున్నాను“ అన్నారు. 

About CineChitram

Check Also

స్పై క్యారెక్ట‌ర్ చేయ‌డం అంత సుల‌భం కాదు – తాప్సీ

Leave a Reply

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading