పవర్స్టార్ పవన్కల్యాణ్ హీరోగా శ్రీ సాయిరాం క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 4గా కొత్త చిత్రం విజయదశమి సందర్భంగా ఫిలింనగర్లోని నిర్మాణ సంస్థ కార్యాలయంలో లాంచనంగా ప్రారంభమైంది. సూర్య మూవీస్ అధినేత ఎ.ఎం.రత్నం ఈ చిత్ర సమర్పకుడుగా వ్యవహరిస్తున్నారు. జిల్లా చిత్రాన్ని డైరెక్ట్ చేసిన ఆర్.టి.నేసన్ దర్శకత్వంలో ఎస్.ఐశ్వర్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఎ.ఎం.రత్నం, శరత్ మరార్, జ్యోతికృష్ణ, ఆర్.టి.నేసన్, ఎ.ఎం.రత్నం సోదరుడు దయాకర్ తదితరులు పాల్గొన్నారు. త్వరలోనే మిగతా నటీనటులు, టెక్నిషియన్స్ వివరాలను తెలియజేస్తారు.
Check Also
మెగాబ్రదర్ నాగబాబుచే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘కళ్యాణ్ ఫ్యాన్ ఆఫ్ పవన్’
శ్రీ లక్ష్మీలోహిత క్రియేషన్స్ అండ్ శ్రీ శరణ్య సినీ చిత్ర కంబైన్స్ సంయుక్తంగా సత్య డైరెక్షన్లో నిర్మాత టి. రామకృష్ణ …
Cine Chitram Telugu Cinema World
