“పిశాచి-2” ప్రచార చిత్రం విడుదల!!

స్వర్ణ భారతి క్రియేషన్స్ పతాకంపై లయన్ సాయి వెంకట్ నిర్మిస్తున్న చిత్రం “పిశాచి-2”. డేంజర్ జోన్ అన్నది ట్యాగ్ లైన్.  నల్లగట్ల శ్రీనివాస్ రెడ్డి-తిరుక్కోవళ్ళూరి మురళీకృష్ణ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ చిత్రానికి.. లయన్ ఏ.వేణుమాధవ్, కొలను సురేంద్రరెడ్డి, అట్లూరి రామకృష్ణ సహ నిర్మాతలు.
 
ఈ చిత్రం ట్రైలర్స్ ను ప్రముఖ నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రతాని రామకృష్ణ గౌడ్, మల్కాపురం శివకుమార్ విడుదల చేసారు. కన్నడలో మంచి విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులోనూ ఘన విజయం సొంతం చేసుకోవాలని వారు అభిలషించారు. ఇకనుంచి తమ స్వర్ణభారతి క్రియేషన్స్ నుంచి రెగ్యులర్ గా సినిమాలు తీస్తామని నిర్మాత సాయి వెంకట్ తెలిపారు.
 
ఆర్.జె.రూపేష్ శెట్టి-రమ్య జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి.. కెమెరా: వీనస్ మూర్తి, సంగీతం: సతీష్ ఆర్యన్, నిర్మాత: లయన్ సాయి వెంకట్, దర్శకత్వం: దేవరాజ్ కుమార్ !!

Stills

About CineChitram

Check Also

‘లోకరక్షకుడి’ ఈస్టర్ శుభాకాంక్షలు

చండ్రస్ ఆర్ట్‌ మూవీస్‌ బ్యానర్‌పై చండ్ర పార్వతమ్మ సమర్పణలో చంద్రశేఖర్‌ చండ్ర నిర్మిస్తున్న ‘లోకరక్షకుడు’ చిత్రం మార్చి 29న లండన్‌ …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading