ఫిలింఫెస్టివ‌ల్‌తో పాల‌కొల్లుకు క‌ళ తెచ్చారు! -మంత్రి కామినేని శ్రీ‌నివాస‌రావు

క‌ళ‌ల‌కు పుట్టినిల్లుగా పేరుగాంచిన పాల‌కొల్లును అంత‌ర్జాత‌య ల‌ఘుచిత్రోత్స‌వం నిర్వ‌హించ‌డం ద్వారా మ‌రోసారి ఆ క‌ళ‌ను తెచ్చార‌ని ఆరోగ్య‌శాఖ మంత్రి కామినేని శ్రీ‌నివాస్ అన్నారు. పాల‌కొల్లు రామ‌చంద్ర గార్డెన్స్‌లో శుక్ర‌వారం నిర్వ‌హించిన క్ష‌ర‌పురి అంత‌ర్జాతీయ ల‌ఘుచ‌ల‌న‌చిత్రోత్స‌వాల‌ను ఆయ‌న ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే డాక్ట‌ర్ నిమ్మ‌ల రామానాయుడు దీనికి అధ్య‌క్ష‌త వ‌హించారు. 
 
మంత్రి కామినేని మాట్లాడుతూ -“ల‌ఘు చిత్రాల పోటీ ఏంటి?  దానికి పాల‌కొల్లు వేదిక ఏంటి? అని తొలుత భావించినా ఊహ‌కు అంద‌ని విధంగా పోటీల‌ను నిర్వ‌హించ‌డం ఆనందాన్నిచ్చింది“ అన్నారు. అనంత‌రం నిర్వాహ‌క క‌మిటీని కామినేని అభినందించారు. 
 
దేవాదాయ శాఖ మంత్రి పైడి కొండ‌ల మాణిక్య‌రావు మాట్లాడుతూ -“స‌మాజాన్ని చైత‌న్య‌ప‌రిచే ల‌గుచిత్రాల‌ను తెర‌కెక్కించే న‌వ‌త‌రాన్ని ప్రోత్స‌హించ‌డం పాల‌కొల్లుకే చెల్లింది. కాలం ఖ‌రీదైన ఈ రోజుల్లో ప్ర‌యాణాల్లో సైతం వినోదాన్ని, సందేశా్ని వీక్షించేలా ల‌ఘుచిత్రాలు రాజ్య‌మేలుతున్నాయ‌న్నారు. వాటికి పాల‌కొల్లు వేదిక‌గా పోటీలు నిర్వ‌హించ‌డం ప్ర‌శంస‌నీయ‌మ‌న్నారు“ అన్నారు. 
 
కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మున్సిప‌ల్ ప్ర‌తిప‌క్ష నేత ఎడ్ల తాతాజీ, బీజేపీ నాయ‌కులు బొంగా సార‌థి, `సంతోషం` అధినేత‌, నిర్మాత సురేష్‌కొండేటి, ఉన్న‌మట్ల క‌బ‌ర్షి, క్షీర‌పురి అంత‌ర్జాత‌య ఫిలింఫెస్టివల్ క‌మిటీ ముత్యాల శ్రీ‌నివాస్, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేశిరాజ్ రాంప్ర‌సాద్‌, స‌భ్యులు రావూరి వెంక‌ట అప్పారావు, ఎం.ఎస్‌.వాసు, ఏతం ర‌మేష్‌, గొర్ల శ్రీ‌నివాస్ పాల్గొన్నారు.  

Stills

About CineChitram

Check Also

టీచ్ ఫర్ చే౦జ్ ఎన్ జీ వో కు సహకారమ౦ది౦చిన రకుల్ ప్రీత్

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading