టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ ను ఆకట్టుకుంటున్న శ్రీనివాస్ రెడ్డి సినిమా

ఎప్పుడు ఎలా మొదలైందో పెద్దగా తెలియదు కానీ ఒక పాటతో ఇండస్ట్రీని తనవైపుకు తిప్పుకున్న మూవీ జయమ్ము నిశ్చయమ్మురా. ఈ మూవీ లో కంటెంట్ ఇండస్ట్రీలోని టాప్ దర్శకులను మెప్పించింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మోషన్ పోస్టర్ ని లాంచ్ చేసి జయమ్ము నిశ్చయమ్మురా అని భరోసా ఇచ్చారు.

కొత్తదనం అనే పదానికి అర్దం లా మారిన సుకుమార్ ‘ ఓ రంగుల చిలకా’ అనే సాంగ్ ని రిలీజ్ చేయడమే కాకుండా దర్శకుడు శివరాజ్ కుమార్ అభిరుచి నచ్చి తన బ్యానర్ లో సినిమా చేయమని కోరాడు. ఇప్పుడు ఈ సినిమా థియేటర్ ట్రైలర్ ని బ్లాక్ బస్టర్ సినిమాల దర్శకుడు కోరటాల శివ రిలీజ్ చేయబోతున్నాడు.

        జనతా గ్యారేజ్ తో హ్యాట్రిక్ సక్సెస్ ను అందుకున్న కొరటాల శివ ఈ మూవీ కథను తెలుసుకొని బాగా ఇంప్రెస్ అయ్యాడు. సెన్సార్ నుండి ప్రశంసలు అందుకున్న ఈ మూవీ పై ఇండస్ట్రీ లో కూడా మంచి ఇంప్రెషన్ ఉంది..ఈ చిత్రంలో శ్రీనివాసరెడ్డి కథానాయకుడి పాత్రలో కనిపిస్తుండగా,పూర్ణ హీరోయిన్ గా నటిస్తుంది. ముఖ్యపాత్రల్లో పోసాని, కృష్ణభగవాన్,జీవ,ప్రవీణ్ మొదలైనవారు కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని శివరాజ్ కనుమూరి తన శివరాజ్ ఫిలింస్ బ్యానర్ పై నిర్మిస్తూ దర్శకత్వం వహించారు. ఈ నెల 13న (ఆదివారం) థియేట్రికల్ ట్రైలర్ ను కొరటాల శివ చేతుల మీదుగా రిలీజ్ చేసి 25న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు

Posters

About CineChitram

Check Also

`ఖ‌య్యూం భాయ్` టీజ‌ర్ ఆవిష్క‌ర‌ణ‌

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading