ప్రముఖ తెలుగు రచయిత డా.కేశవరెడ్డి గారి నవల అతడు అడవిని జయించాడు ప్రపంచవ్యాప్త సినిమా నిర్మాణ హక్కులను హక్కులకు డిఎస్ఎన్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ సొంతం చేసుకుంది. అంతర్జాతీయ ఫిలింమేకర్ దూలం సత్యనారాయణ దర్శకత్వంలో పలు చిత్ర నిర్మాణ సంస్థల భాగస్వామ్యంతో ఈ ప్రఖ్యాత నవలను సినిమాగా రూపొందించడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దూలం సత్యనారాయణ మాట్లాడుతూ అతడు అడవిని జయించాడు తెలుగు సాహిత్యంలో గొప్ప నవలగా అశేష పాఠకుల ఆదరణ చూరగొంది. అంతర్జాతీయ స్థాయి సినిమాగా రూపొందించే సత్తా ఈ నవలలో వుంది. భారీ బడ్జెట్తో అత్యాధునిక టెక్నాలజీని మేళవించి ఆస్కార్, కాన్స్, లొకర్నో, బెర్లిన్, టొరంటో, బుసాన్ వంటి అంతర్జాతీయ సినిమా వేదికల మీద పోటీ పడేలా ఈ సినిమా నిర్మాణాన్ని చేపడుతాం. ఇప్పటికే హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో చర్చలు జరుపుతున్నాం అన్నారు. కాగా దూలం సత్యనారాయణ ఇప్పటివరకు అనేక అంతర్జాతీయ డాక్యుమెంటరీలను రూపొందించాడు. ఇటీవలే తెలంగాణ టూరిజం ఫిలింకి పోర్చుగల్లో ఇంటర్నేషనన్ అవార్డుని సాధించారు.
Tags athadu adavini jayinchaadu
Check Also
మెగాబ్రదర్ నాగబాబుచే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘కళ్యాణ్ ఫ్యాన్ ఆఫ్ పవన్’
శ్రీ లక్ష్మీలోహిత క్రియేషన్స్ అండ్ శ్రీ శరణ్య సినీ చిత్ర కంబైన్స్ సంయుక్తంగా సత్య డైరెక్షన్లో నిర్మాత టి. రామకృష్ణ …